Sunday, October 22, 2006

తిరుపతిలో మరో వైద్యకళాశాల

SVIMS (Sri Venkateswara Institute of Medical Sciences, Tirupati) మరియు కంచి కామకోటి పీఠం ఆధ్వర్యవంలో తిరుపతిలో వైద్యకళాశాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది.ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.రాజశేఖరరెడ్డి అధ్యక్షతన 2006 అక్టోబరు 19న హైదరాబాదులో జరిగిన SVIMS పాలకమండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కంచిపీఠం ఆధ్వర్యవంలో ప్రస్తుతం కర్ణాటకలో శంకర నేత్రాలయ బాగా పనిచేస్తోందని రాష్ట్రంలో సైతం వైద్యసేవలు అందించడానికి ఆ పీఠం ముందుకొచ్చిందని ఆంధ్ర అధికారులు వివరించారు.ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం ప్రాతిపదికన రేణిగుంట విమానాశ్రయం దగ్గర వైద్యకళాశాల మరియు బోధనాస్పత్రి నిర్మిస్తారు.