Sunday, October 22, 2006

SEZ ల ద్వారా 4.70 లక్షల మందికి ఉపాధి

రాష్ట్రంలో ఏర్పాటు చెయ్యనున్న 48 ప్రత్యేక ఆర్థిక మండళ్ళ (Special Economic Zones) ద్వారా 4 లక్షల 70 వేల మందికి ఉపాధి లభిస్తుందని ఆంధ్ర ముఖ్యమంత్రి డా.వై.ఎస్.రాజశేఖరరెడ్డి తెలిపారు.ఈ మేరకు ఆయన కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

IT మరియు IT ఆధారిత సేవల రంగంలోనే 2 లక్షల 35 వేల ఉద్యోగావకాశాలు ఏర్పడబోతున్నాయి.ఈ రంగాలకై 27 SEZ లు, తోలు మరియు పాదరక్షల రంగంలో 3, బయోటెక్నాలజీ, రెడీమేడ్ దుస్తులు, నిర్మాణ సంబంధ ఉత్పత్తులు, కాగితం, వస్త్రాలు, సెమికండక్టర్, బంగారు రత్న వజ్రాభరణాలు- ఈ రంగాలకి ఒక్కొక్కటి చొప్పున SEZ లను కేంద్ర ప్రభుత్వం అనుమతించింది.వీటికి ప్రభుత్వభూములనే కేటాయించడం జరిగింది.విశాఖపట్నంలో HPCL మరియు కాకినాడలో ONGC కోసం ఏర్పాటు కాబోతున్న SEZ లకు ప్రభుత్వం బంజరు భూములని సేకరించి అందుబాటులో ఉంచుతుంది.సారవంతమైన పంటభూములను కేటాయించడం జరగదు.