Sunday, October 22, 2006

పెరిగిన తలసరి ఆదాయం (Per Capita Income)

2004-05లో రాష్ట్ర తలసరి ఆదాయం 23,807 రూపాయలుగా ఉందని అర్థ గణాంకాల శాఖ వెల్లడించింది.ఈ వివరాల్ని అర్థ గణాంక శాఖ డైరెక్టర్ సరోజా రామారావు 2006అక్టోబరు 17వ తేదీన విడుదల చేశారు.అంటే ఒక్కో వ్యక్తి ఆదాయం నెలకి సగటున దాదాపు రెండువేల రూపాయలు.రాష్ట్రంలో వివిధ రంగాల ఆదాయాల్ని స్థూల ఉత్పత్తిని తలసరి ఆదాయాన్ని గణించడానికి ఇప్పటిదాకా 1993-94ఆధార సంవత్సరంగా ఉంది.దీన్ని ప్రస్తుతం 1999-2000కి మార్చారు.

2004-05లో స్థూల ఉత్పత్తి రూ.2,02,576 కోట్ల నుంచి 3.08 శాతం వృద్ధి చెంది రూ.2,08,818 కోట్లకి చేరింది. కొన్ని రంగాల ఆదాయం పెరగ్గా మరికొన్ని రంగాల ఆదాయం తగ్గింది.వ్యావసాయిక ఆదాయం తరుగుదల చూపగా రియల్ఎస్టేట్ ఆదాయం భారీగా పెరిగింది.ప్రజలు వ్యావసాయిక సంస్కృతి నుంచి పారిశ్రామిక సంస్కృతికి మళ్ళే క్రమంలో వ్యవసాయం వాటా తగ్గి ఇతర రంగాల వాటా పెరగడం అత్యంత సహజమని ఇందులో ఆందోళనపడాల్సిందేమీ లేదని కొందరు ఆర్థికశాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.