Sunday, October 22, 2006

ఇక విశాఖ-కాకినాడల మధ్య సందడే సందడి

కాకినాడ రేవు నుంచి విశాఖ జిల్లా గంగవరం రేవు దాకా రూ.225 కోట్ల అంచనా వ్యయంతో కోస్తా రహదారి నిర్మించడానికి ప్రణాళిక రూపొందుతోంది.దీనికి సంబంధించిన ప్రతిపాదనల్ని రోడ్లూ-భవనాల శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సమర్పించింది. పలు భారీ వాహనాల రద్దీతో విశాఖ-చెన్నైల్ని కలిపే అయిదో నెంబరు జాతీయ రహదారిపై విపరీతమైన ఒత్తిడి ఏర్పడుతోంది.దీనితో ఆ ప్రాంతంలోని పరిశ్రమలకి సరుకుల రవాణాలో జాప్యంతో పాటు ఖర్చులూ పెరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో NH-5కి ప్రత్యామ్నాయంగా కాకినాడ-గంగవరం రేవుల్ని కలిపే రహదారి ప్రతిపాదన ముందుకొచ్చింది.

సముద్రతీరం వెంబడి రోడ్డు సౌకర్యం ఏర్పడితే పెద్దయెత్తున సముద్రాధారిత పరిశ్రమలు వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.