Thursday, October 26, 2006

కృష్ణపట్నానికి మరో రెండు విద్యుత్‌కేంద్రాలు

2006 అక్టోబరు 24 : నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఒక్కొక్కటి 600 మెగావాట్ల సామర్థ్యం గల రెండు విద్యుదుత్పత్తి కేంద్రాల్ని స్థాపించనున్నట్లు సర్వేపల్లి (నెల్లూరు జిల్లా)MLA మరియు మాజీ మంత్రి శ్రీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.వీటి స్థాపనకి రూ.2000కోట్లు ఖర్చుపెట్టనున్నారు. ఇప్పటికే రూ.15,000 కోట్ల వ్యయంతో నిర్మాణమవుతున్న 4,000 మెగావాట్ల కృష్ణపట్నం థెర్మల్ పవర్‌ప్లాంటుకి ఈ రెండూ అదనం. ఇవి పూర్తయితే మరో 600 మెగావాట్ల విద్యుత్‌కేంద్రం కూడా కృష్ణపట్నంలోనే ఏర్పాటయ్యే అవకాశం ఉందని ఆయన అన్నారు.అప్పుడు కృష్ణపట్నం కర్మాగారాల స్థాపిత శక్తి (installed capacity) 5,800 మెగావాట్లకి చేరుకోగలదు.వీటిల్లో ఒక్కొక్క చిరు (mini) కర్మాగారానికి 500 ఎకరాల స్థలం అవసరమని ప్రభాకర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.ఈ కొత్త కర్మాగారాల నిమిత్తం ప్రస్తుతం అయిదో నెంబరు జాతీయ రహదారినీ కృష్ణపట్నం పోర్టుని అనుసంధానం చేస్తున్న రెండు వరసల (two-lane) రోడ్డుని 2007 మధ్య నాటికి నాలుగు వరసల రోడ్డు స్థాయికి పెంచడం (upgradation) పూర్తవుతుందని ఆయన చెప్పారు.అలాగే కృష్ణపట్నం పోర్టు నుంచి వెంకటాచలం దాకా రైలుమార్గం వేస్తారని కూడా తెలుస్తోంది.ఈ అభివృద్ధి చర్యలతో కృష్ణపట్నం విశాఖపట్నమంతటి మహారేవునగరంగా అవతరించబోతోంది.కృష్ణపట్నం అభివృద్ధి ప్రాజెక్టుల కోసం అన్ని దేశాల కార్పొరేట్ దిగ్గజాలూ అహమహమికతో పోటీపడుతున్నాయి.పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈ కాంట్రాక్టుల విషయాలు చూసుకుంటోంది.

0 Comments:

Post a Comment

<< Home