పూర్తి కావస్తున్న విద్యుత్కేంద్రాల నిర్మాణం
2006 అక్టోబర్ 26 : రాయలసీమ థెర్మల్ పవర్ స్టేషన్ (RTPS) యొక్క విస్తరణ ప్రాజెక్టులోని 210 మెగావాట్ల తొలి యూనిట్టు వచ్చే నెల నుంచి పని చెయ్యడం ప్రారంభిస్తుంది. రెండో యూనిట్టు (210 మెగావాట్లు) 2007 ఫిబ్రవరి నుంచి పనిచేస్తుంది.ముఖ్యమంత్రి డా.వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఈ మేరకు జెన్కో ట్రాన్స్కో అధికారులకి ఆదేశాలు జారీ చేశారు.
విజయవాడ థెర్మల్ పవర్ స్టేషన్ (VTPS)కి చెందిన 500 మెగావాట్ల నాలుగో యూనిట్టుని 2008 ఆగస్టు నాటికల్లా సిద్ధంగా ఉంచాలని ముఖ్యమంత్రి అధికారుల్ని ఆదేశించారు.
2,100 మెగావాట్ల కరీంనగర్ గ్యాస్ పవర్ ప్లాంటుకి చెందిన తొలి దశని 2009 మార్చి నాటికి ; అలాగే రెండో దశని 2009 సెప్టెంబరు నాటికి ; మూడో దశని 2010 మే నాటికి పూర్తి చేయ్యాలని కూడా ఆదేశించడం జరిగింది.

0 Comments:
Post a Comment
<< Home