Thursday, October 26, 2006

నీటి పారుదలకి ప్రపంచ బ్యాంకు ఋణం

2006 అక్టోబర్ 26 : నాగార్జునసాగర్ కాలువల్ని ఆధునీకరించడం కోసం అలాగే పలు చిన్న తరహా ఆనకట్టలు నిర్మించడం కోసం ప్రపంచ బ్యాంకు మన రాష్ట్రానికి రూ.3,200కోట్ల ఋణాన్ని ఇవ్వడానికి అంగీకరించిందని చిన్న తరహా నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ పొన్నాల లక్ష్మయ్య నిన్న ప్రకటించారు.అందులో రూ.2000కోట్లు నాగార్జునసాగర్ కాలువల ఆధునీకరణకే వ్యయమౌతుంది.ఈ ఋణానికి సంబంధించి షరతులేవీ లేవని ఆయన చెప్పారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఋణభారం రూ.86,000కోట్లు దాటి పోయింది.అంటే తలసరి ప్రతి పౌరుడి మీదా ఉన్న ఋణభారం రూ.9,316.రాష్ట్రంలో కాంగ్రెస్‌ప్రభుత్వం పగ్గాలుచేపట్టే (2004)నాటికి అది సుమారు రూ.58,000కోట్ల వద్ద ఉండేది.

0 Comments:

Post a Comment

<< Home