Thursday, October 26, 2006

తెలుగు ఎడ్యుకేషనల్ కిట్ నేడే విడుదల

అల్పమాత్ర పఠన శక్తి గల విద్యార్థులలో తెలుగు పఠన అవగాహన నైపుణ్యాల్ని కేవలం 14 వారాలలోనే మెరుగుపరచేందుకు ఉద్దేశించిన ఒక ఎడ్యుకేషనల్ కిట్‌ని పబ్లిక్‌గార్డేన్సు (హైదరాబాదు)లోని జూబిలీహాల్లో ఈరోజు విడుదల చేస్తున్నారు. దీన్ని Christian Children's Fund-India (CCF-India)వారు అభివృద్ధి చేశారు.గతంలో తిరుపతిలో 500 మంది ప్రభుత్వ పాఠశాలా విద్యార్థులపై చేసిన ఒక సర్వేలో వారికి అతి ప్రాథమికమైన పఠన అవగాహన నైపుణ్యాలు (reading and comprehension skills)గాని మౌలికమైన లెక్కల పరిజ్ఞానం గాని లేవని బయటపడ్డమే ఈ ఎడ్యుకేషనల్ కిట్ సృష్టికి ప్రేరణ.దీనికి వారు "పఠన నైపుణ్య మెరుగుదల కార్యక్రమం" (Reading skill improvement programme) అని పేరుపెట్టారు.

ముందు ఈ కిట్‌ని ప్రయోగాత్మకంగా జంటనగరాల్లోని 300మంది ప్రభుత్వ పాఠశాలా విద్యార్థుల వినియోగంలోకి తెస్తారు.తరువాత దీన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠశాలా విద్యాశాఖ సహకారంతో రాష్ట్రమంతటా వినియోగంలోకి తెస్తారు.ఈ కిట్‌లో ప్రధానంగా ఒక User Manualమరియు నూట తొంభయ్యొక్క Reading skill improvement Cards ఉంటాయి.దీన్ని రూపొందించడంలో District Institute of Education and Training కి చెందిన అధ్యాపకులు మరియు ఉపాధ్యాయులు ప్రముఖపాత్ర పోషించారు.