Sunday, November 12, 2006

సుల్తాన్‌పూర్‌లో నోవార్టిస్ కేంద్రం

2006 నవంబర్ 09 : ప్రపంచంలో నాలుగో అతి పెద్ద ఔషధ కంపెనీ Novartis మెదక్ జిల్లా సుల్తాన్‌పూర్‌లో 150ఎకరాల్లో ఒక పెద్ద ఔషధ పరిశోధన ప్రాంగణాన్ని (research campus)ఏర్పాటు చెయ్యబోతోంది.అందులో వైద్య ఆరోగ్య సంబంధమైన సమాచార-సాంకేతిక సేవల(IT Services)పైపరిశోధనలు నిర్వహిస్తారు.ఈ మేరకు ఆ కంపెనీ గురువారం నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.ఆర్ సమక్షంలో రాష్ట్ర IT శాఖతో అవగాహన ఒప్పందం (MoU)కుదుర్చుకుంది.ఈ కార్యక్రమంలో ITమంత్రిణి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి ఉన్నతాధికారులు S.P.సింగ్ రత్నప్రభ HUDA వి.సి.జయేశ్‌రంజన్‌లతో పాటు నోవార్టిస్ ఎం.డి. శ్రీ రంజిత్ సహానీ పాల్గొన్నారు.150 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎకరా రూ.30 లక్షల చొప్పున కేటాయించడానికి ఈ సందర్భంగా అంగీకారం కుదిరింది.దీనికి ప్రత్యేక ఆర్థిక మండలం(SEZ)హోదా కల్పిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.షుమారు వెయ్యిమంది ITనిపుణుల్ని నియమించబోతున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.